ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా కార్యాలయ నిర్మాణంపై పిటిషన్.. సుప్రీం కోర్టులో విచారణ - తెదేపా కార్యాలయ నిర్మాణంపై సుప్రీం కోర్టులో విచారణ తాజా వార్తలు

గుంటూరులో తెదేపా కార్యాలయానికి భూ కేటాయింపుపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలుకు 2 వారాల గడువు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

pill in the Supreme Court on the construction of  TDP office
తెదేపా కార్యాలయ నిర్మాణంపై సుప్రీం కోర్టులో విచారణ

By

Published : Apr 15, 2021, 7:20 PM IST

గుంటూరులో తెదేపా కార్యాలయానికి భూ కేటాయింపుపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్​ పైన.. సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. నీటి వనరులున్నా.. భూ కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘించారని ఆళ్ల పిటిషన్​లో పేర్కొన్నారు. ఆయన.. ఆలస్యంగా పిటిషన్‌ వేశారని హైకోర్టు గతంలో వ్యాజ్యాన్ని కొట్టేసింది.

ఆ కొట్టివేత ఆదేశాలను పక్కనపెట్టిన జస్టిస్ ఆర్​.ఎఫ్​.నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం.. మెరిట్స్ ఆధారంగా పిటిషన్​పై విచారణ జరపాలని హైకోర్టుకు సుప్రీం సూచనలు జారీ చేసింది. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలుకు 2 వారాల గడువు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రీజాయిండర్ వేసేందుకు మరో వారం గడువు ఇవ్వాలని.. 4 నెలల్లో హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details