ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 3, 2020, 8:07 PM IST

ETV Bharat / city

ధరల పెరుగుదలపై సీపీఎం ప్రజాచైతన్య భేరి

సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడ ప్రకాష్​నగర్​లో ప్రజా చైతన్య భేరి జరిగింది. ధరల పెరుగుదల, రేషన్ దుకాణాల్లో నాణ్యత లేని సరకులు, వంట గ్యాస్ సబ్సిటీ వంటి పలు సమస్యలపై పార్టీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

cpm protest on prices hike
ప్రజా చైతన్య భేరిలో సీపీఎం నేతలు

రేషన్ దుకాణాల్లో నాణ్యత లేని బియ్యం, శనగలు పంపిణీ చేస్తున్నారంటూ సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలపై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రకాష్​నగర్​లో ప్రజాచైతన్య భేరి నిర్వహించారు. వంట గ్యాస్ సబ్సిడీ బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. శనగల స్థానంలో కందిపప్పు అందించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details