ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 1, 2020, 4:51 PM IST

ETV Bharat / city

'కరోనా కష్టకాలాన్ని కార్మిక లోకం ధైర్యంగా ఎదుర్కొవాలి'

కార్మికుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నిరతంరం కృషిచేస్తోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వ్యాఖ్యనించారు. కరోనా కష్టకాలాన్ని కార్మిక లోకం ధైర్యంగా ఎదుర్కొని బయటబడాలన్నారు.

కరోనా కష్టకాలాన్ని కార్మిక లోకం ధైర్యంగా ఎదుర్కొని బయటపడాలని మేడే సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ పిలుపునిచ్చారు. కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయి కోట్ల మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలన్నారు. అందరూ ఐకమత్యంగా అడ్డంకులను అధిగమించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details