ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్లింప్స్ ఆఫ్ సాయిల్ సైన్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్

book release తెలుగు శాస్త్రవేత్తలు రచించిన గ్లింప్స్ ఆఫ్ సాయిల్ సైన్స్ అనే పుస్తకాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. శాస్త్రవేత్తల సేవలు దేశానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా పవన్ వారిని కొనియాడారు.

By

Published : Aug 24, 2022, 8:39 PM IST

గ్లింప్స్ ఆఫ్ సాయిల్ సైన్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్
గ్లింప్స్ ఆఫ్ సాయిల్ సైన్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్

Pawan Kalyan: తెలుగు శాస్త్రవేత్తలు రచించిన 'గ్లింప్స్ ఆఫ్ సాయిల్ సైన్స్' అనే పుస్తకాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. భూసార శాస్త్రంపై పీహెచ్​డీ చేసిన ఈటెల సత్యనారాయణ, సంతోశ్ కుమార్ మంచాల, జురుకుంట్ల భార్గవిలతో కలిసి ఉత్తర భారత శాస్త్రవేత్తలు హనుమాన్ సింగ్ జాతవ్, నిధి లూత్రా, జకనూర్ బి.అయివల్లి ఈ పుస్తకాన్ని రచించారు. రైతులకు, పర్యావరణానికి ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ గ్రంథాన్ని రచయితలు పవన్​కు అంకితం ఇచ్చారు.

శాస్త్రవేత్తల సేవలు దేశానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా పవన్ కొనియాడారు. జనసేన పక్షాన 'గ్రీన్ పాలసీ' రూపొందించాలని సంకల్పించామని చెప్పారు. అందులో పాలు పంచుకోవాల్సిందిగా రచయితలను కోరగా..అందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details