లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా సాయాన్ని వైకాపా నాయకులే పంపిణీ చేయడాన్ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో పవన్ కల్యాణ్ దృశ్య, శ్రవణ మాధ్యమ సమీక్ష నిర్వహించారు.
కరోనాను అరికట్టడానికి లాక్ డౌన్ విధించడంతో పేద వర్గాలు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు పార్టీపరంగా అండగా నిలవాలని పవన్ నేతలకు పిలుపునిచ్చారు. ప్రధాని సూచనలను బాధ్యతాయుతంగా పాటించాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడం, రోజువారీ కూలీలు, చిన్నపాటి వృత్తుల్లో ఉన్నవారు, పేద వర్గాలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను, రైతుల సమస్యలను పార్టీ నేతలు పవన్ దృష్టికి తీసుకొచ్చారు.