ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 25, 2021, 9:06 PM IST

ETV Bharat / city

NHRC Notice: విద్యార్థుల ఆత్మహత్యలపై.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్​హెచ్​ఆర్సీ నోటీసులు

విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్​హెచ్​ఆర్సీ నోటీసులు (NHRC notice to ap govt) జారీ చేసింది. ఏపీ, తెలంగాణలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదు మేరకు ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్​హెచ్​ఆర్సీ నోటీసులు
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్​హెచ్​ఆర్సీ నోటీసులు

రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ (NHRC notice to ap govt over students suicides) చేసింది. ఏపీ, తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై అందిన ఫిర్యాదు మేరకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు ఇచ్చింది.

ప్రైవేటు విద్యా సంస్థల్లో ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుపై స్పందించి నివేదిక ఇవ్వాలని నెల క్రితమే ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు ఇచ్చింది. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం నోటీసులపై స్పందిచలేదు.

దీంతో మరోసారి నోటీసులు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం.. ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నివేదిక ఇవ్వకపోతే చట్టబద్ధంగా తీసుకునే చర్యలకు సిద్ధం కావాలని హెచ్చరించింది.

ఇదీ చదవండి

CBN: ఆ 60 మంది మరణానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details