NTR Trust: హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పాల్గొని కేక్ కట్ చేశారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని భువనేశ్వరి ఆకాంక్షించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలను ఆమె సమీక్షించారు. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలలో ఇటీవల వరద బీభత్సంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు సేవలందించిన ట్రస్ట్ సిబ్బందిని, ప్రతినిధులను అభినందించారు.