ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

New Ministers Tour: కొత్త మంత్రులు.. కొత్త పర్యటనలు ప్రారంభం..

New Ministers Tour: రాష్ట్రంలో కొత్త కేబినెట్ కొలువుదీరి, మంత్రులు బాధ్యతలు చేపట్టిన తర్వాత నూతన మంత్రులు తమ పర్యటనలను ప్రారంభించారు. తాజాగా విజయనగరంలో ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర, కొవ్వూరులో హోం శాఖ మంత్రి తానేటి వనిత, గన్నవరంలో పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్‌, కోనసీమ జిల్లా పి.గన్నవరంలోని అయినవిల్లిలో రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పర్యటించారు.

By

Published : Apr 13, 2022, 6:43 PM IST

Updated : Apr 13, 2022, 7:57 PM IST

New Ministers Tour
పర్యటనలను ప్రారంభించిన నూతన మంత్రులు

New Ministers Tour: ప్రమాణ స్వీకారం అనంతరం విజయనగరానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి రాజన్నదొరకు ఘన స్వాగతం లభించింది. మంత్రి హోదాలో తొలిసారి విజయనగరం చేరుకున్న ఆయనకు జిల్లా పరిషత్ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, ఎస్పీ దీపిక, జేసీ అశోక్ మయూర్, డీఆర్వో గణపతిరావు, డీఆర్​డీఏ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ రఘురాజు, పలువురు శాసనసభ్యలు, కొందరు వైకాపా నేతలు పుష్పగచ్చాలు అందచేసి శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రి సతీసమేతంగా పైడితల్లి అమ్మవారిని దర్శించకున్నారు.

విజయనగరంలో ఉప ముఖ్యమంత్రి రాజన్నదొరకు ఘన స్వాగతం

"మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎంకు, రాష్ట్ర, జిల్లా వైకాపా నేతలకు నా కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తా. అదేవిధంగా గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఆ శాఖ మంత్రిగా గిరిజన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తాను. ముఖ్యంగా రాష్ట్రంలోని గిరిజనుల విద్య, వైద్య, రహదారుల సమస్యలను తొలి ప్రాధాన్యత అంశాలుగా పరిగణలోకి తీసుకుంటా. గిరిజనాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను పూర్తిస్థాయి సద్వినియోగంపై దృష్టి పెడతా" - రాజన్నదొర, రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి

కొవ్వూరులో హోం శాఖ మంత్రి: రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత మొట్టమొదటిసారిగా కొవ్వూరు మండలంలో పర్యటించారు. వెదుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నాయకులతో ముచ్చటించారు. స్థానిక అభిమానులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

గన్నవరంలో పరిశ్రమల శాఖా మంత్రి: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆప్కో షోరూమ్​ను పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ప్రారంభించారు. చేనేత సంఘాలు, కార్మికులకు ఉన్న బకాయిలు అన్నింటినీ తీర్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని మంత్రి తెలిపారు. చేనేత కార్మికులకు రానున్నది స్వర్ణయుగమేనన్నారు.

పి.గన్నవరంలో రవాణా శాఖ మంత్రి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు మంచి శాఖను కేటాయించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లిలో కొలువైన సిద్ది వినాయకుడికి ఆలయాన్ని దర్శించుకుని 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. తిరుమల తిరుపతిలో కాలుష్య నివారణకోసం 100 ఎలక్ట్రికల్ బస్సులను మే 15 లోగా ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. దశలవారీగా వాహనాలను తిరుపతి పట్టణంతో పాటు విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలలో అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి: Pranahitha Pushkaralu 2022: ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం

Last Updated : Apr 13, 2022, 7:57 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details