రాష్ట్రంలో కొత్తగా 14,986 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 84 మంది మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో 60,124 కరోనా పరీక్షలు చేశారు. కరోనా నుంచి మరో 16,167 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,89,367 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలో జిల్లాలో 2,352 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. విశాఖ- 1,618, గుంటూరు-1,575, చిత్తూరు-1,543, నెల్లూరు-1,432, శ్రీకాకుళం-1,298, కడప-1,224 మందికి కొత్తగా వైరస్ సోకింది.