గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 28,509 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 248 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఎవ్వరూ మృతి చెందలేదు. కరోనా నుంచి మరో 253 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,158 కొవిడ్ యాక్టివ్ కేసులు(Corona active cases in Andhra Pradesh) ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.