ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్.. రాష్ట్రాన్ని బీహార్​లా మార్చేశారు: లోకేశ్ - నాడు నేడుపై లోకేశ్ వ్యాఖ్యలు

"ఆంధ్రప్రదేశ్​ను జగన్ రెడ్డి బీహార్​లా మార్చేశారు" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. నాడు - నేడు స్కీంలో భాగంగా నాడు పచ్చని సీమగా ఉన్న ప్రాంతాన్ని నేడు ఫ్యాక్షన్‌ సీమ‌ చేశారని మండిపడ్డారు.

రాష్ట్రాన్ని జగన్​రెడ్డి బీహార్​లా మార్చేశారు: లోకేశ్
రాష్ట్రాన్ని జగన్​రెడ్డి బీహార్​లా మార్చేశారు: లోకేశ్

By

Published : Jan 30, 2021, 12:14 PM IST

సీఎం జగన్​పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. "గన్ రాకముందే జగన్ వస్తాడు" అని గాలి కబుర్లు చెప్పారని దుయ్యబట్టారు. "ఇప్పుడు రివర్స్ లో జ‌గ‌న్ రెడ్డి కంటే ముందు.. ఆయ‌న పెంచిపోషిస్తోన్న ఇసుక‌ మాఫియా గ‌న్‌లతో వ‌చ్చి తూర్పుగోదావరి జిల్లా, లంక‌ల గ‌న్నవ‌రంలో రెచ్చిపోయింది" అని ఆక్షేపించారు.

భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి, ఇసుకని బంగారం చేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు గన్నులు పట్టుకొని వైకాపా ఇసుకాసురులు ప్రజలపై పడ్డారని ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఎంతకైనా తెగించి, ప్రజల ప్రాణాలు తీస్తారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details