ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 30, 2021, 11:02 PM IST

ETV Bharat / city

సర్పంచ్​ల హక్కులు కాలరాసే విధంగా ప్రభుత్వ జీవో: లోకేశ్

సర్పంచ్​ల హక్కులు కాలరాసే విధంగా వైకాపా ప్రభుత్వం జీవో నెంబర్ 2 ను తెచ్చిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి ఈ జీవో విరుద్ధమని చెప్పారు. తక్షణమే సంబంధిత జీవోను రద్దు చేసి సర్పంచుల అధికారాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

lokesh on government
lokesh on government

సర్పంచుల హక్కులు కాలరాసే విధంగా.. ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. స‌ర్పంచుల‌కు కట్టబెట్టిన అధికారాలను ఒక్క జీవోతో సీఎం జ‌గ‌న్‌ మింగేశారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తల పెత్తనం కోసం స‌ర్పంచుల‌ను డ‌మ్మీల‌ను చేసే విధంగా వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ధ్వజమెత్తారు.

గ్రామ స‌చివాల‌యాల‌కు స‌ర్పంచులను దూరం చేయ‌డం అన్యాయ‌మని, ముఖ్యమంత్రి అయ్యాక నియంత‌కంటే ఘోరంగా రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్య ప‌ద్ధతుల‌ పైనా జగన్ దాడుల‌కు పాల్పడుతున్నారని లోకేశ్ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details