ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Nadendla On YSRCP Govt: ఆ పేరుతో 15 వేల ఎకరాలు కాజేశారు : నాదెండ్ల మనోహర్‌ - జగన్ ప్రభుత్వంపై నాదెండ్ల కామెంట్స్

Nadendla Manohar On YSRCP: వాన్​పిక్ పేరుతో అధికార పార్టీ నేతలు 15 వేల ఎకరాలు దోచుకున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన.. రోడ్ల కోసం రాష్ట్ర బడ్జెట్​లో ప్రవేశపెట్టిన రూ.13,700 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆధునిక జమీందారుల పాలన కొనసాగుతోందని..ముఖ్యమంత్రి జగన్ తీరు 'మాగ్జిమం కరప్షన్ మినిమం సీఎం' అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.

Nadendla On YSRCP Govt
Nadendla On YSRCP Govt

By

Published : Dec 5, 2021, 8:02 PM IST

Updated : Dec 5, 2021, 9:14 PM IST

Nadendla On Jagan Govt: వైకాపా ప్రభుత్వ విధానాలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జనసేన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో అవినీతి, అక్రమ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలోనే.. రెండో స్థానం నిలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నా.. ప్రభుత్వంలో ఎలాంటి కదలికా లేదని ఆక్షేపించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. 10వేల రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు ఎలాంటి ఉపయోగం లేకుండా చేశారన్నారు. గుంటూరు జిల్లాలో మెుక్కజొన్న కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

వాన్​పిక్ పేరుతో అధికార పార్టీ నేతలు 15 వేల ఎకరాలు దోచుకున్నారని నాదెండ్ల ఆరోపించారు. రోడ్ల కోసం రాష్ట్ర బడ్జెట్​లో ప్రవేశపెట్టిన రూ.13,700 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులతోపాటు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వమే ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనాతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే వన్​ టైమ్ సెటిల్​మెంట్ (ఓటీఎస్) పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు.

అమరావతి కోసం చిన్న సన్నకారు రైతులు తమ భూములను త్యాగం చేస్తే.. సీఎం జగన్ వారిని అవమానించి రోడ్డుకు లాగారన్నారు. వాలంటీర్ వ్యవ్యస్థతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆక్షేపించారు.

రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయందన్న నాదెండ్ల.. ఎస్సీలపై ఎస్సీలతోనే అట్రాసిటీ కేసులు పెట్టించటం దారుణమన్నారు. రాష్ట్రంలో ఆధునిక జమీందారుల పాలన కొనసాగుతోందని.. ముఖ్యమంత్రి జగన్ తీరు 'మాగ్జిమం కరప్షన్.. మినిమం సీఎం' అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి

రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి మాది.. మా ముందు తల వంచాల్సిందే : ఉద్యోగనేత సంచలన వ్యాఖ్యలు

Last Updated : Dec 5, 2021, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details