ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దారుణం: కారులో ముగ్గురు ఉండగానే నిప్పంటించిన వ్యక్తి

ముగ్గురు వ్యక్తులు కారులో ఉండగానే.. పెట్రోల్​ పోసి నిప్పంటించిన ఘటన విజయవాడలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. స్థల వివాదమే ఈ హత్యాయత్నానికి కారణమని తెలుస్తుండగా.. బాధితులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

By

Published : Aug 17, 2020, 7:19 PM IST

Updated : Aug 17, 2020, 8:10 PM IST

దారుణం: కారులో ముగ్గురు ఉండగానే నిప్పంటించిన వ్యక్తి
దారుణం: కారులో ముగ్గురు ఉండగానే నిప్పంటించిన వ్యక్తి

కారులో ముగ్గురు ఉండగానే నిప్పంటించిన వ్యక్తి

విజయవాడలో దారుణం జరిగింది. నోవాటెల్​ హొటల్​ వద్ద వేణుగోపాల్​రెడ్డి అనే వ్యక్తి.. కారులో ముగ్గురు ఉండగానే పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో నాగవల్లి, గంగాధర్​, కృష్ణారెడ్డి అనే ముగ్గురు గాయపడ్డారు. వీరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

ఓ స్థలం విషయమై మాట్లాడేందుకు నలుగురు కారులో నోవాటెల్​కు వచ్చారని.. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వేణుగోపాల్​ రెడ్డి కారు దిగి.. డోర్​ వేసి నిప్పంటించినట్లు సమాచారం. ఈ దాడిలో కారు పూర్తిగా దగ్ధమైంది.

Last Updated : Aug 17, 2020, 8:10 PM IST

ABOUT THE AUTHOR

...view details