విజయవాడ కనకదుర్గ గుడి అవినీతి వ్యవహారం నగరపాలక సంస్థ ఎన్నికల్లో రాజకీయ వేడిని రాజేసింది. అవినీతిలో అసలు దొంగలు మంత్రి వెల్లంపల్లి, ఈవో సురేష్ బాబులేనని విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి, ఈవోలపై చర్యలు తీసుకోకుండా చిరుద్యోగులపై కొరడా ఘుళిపించటం తగదని హితవు పలికారు. పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి గంగాధర్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మంత్రి అవినీతిపై స్పందించి... వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
హోరాహోరీగా ప్రచారాలు
39వ డివిజన్ భాజపా ఎన్నికల కార్యాలయాన్ని స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి నిరీష్తో కలిసి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ బాబు ప్రారంభించారు. 45వ డివిజన్లో జనసేన కార్పొరేటర్ అభ్యర్థి బొమ్ము గోవింద లక్ష్మి సితార సెంటర్ పరిసరాల్లో ప్రచారం నిర్వహించారు. 57 డివిజన్లో తేదేపా కార్పొరేటర్ అభ్యర్థి గంగాధరతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని నాని గొల్లపాలెం గట్టు పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేశారు.
మేయర్ పదవి ఎవరికి దక్కేనో..?