ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాలా?: జగన్​కు లేఖలో రఘురామ

By

Published : Jun 13, 2021, 11:22 AM IST

Updated : Jun 13, 2021, 12:16 PM IST

నాకు నేనుగా స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాల్సి ఉంటుంది: రఘురామ
నాకు నేనుగా స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాల్సి ఉంటుంది: రఘురామ

11:06 June 13

48 గంటల్లో సమాధానం ఇవ్వాలని డిమాండ్

వైకాపా వెబ్‌సైట్‌ నుంచి తన పేరు తొలగింపుపై పార్టీ అధ్యక్షుడు జగన్​కు.. ఎంపీ రఘురామ లేఖ రాశారు. పార్టీ అధికారిక వెబ్‌సైట్‌ ఎంపీల జాబితాలో పేరు తొలగించడాన్ని లేఖలో ప్రస్తావించారు. వైకాపా తరఫున గెలిచిన తన పేరును ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. పార్టీ నుంచి బహిష్కరించారా? అని సందేహం వ్యక్తం చేశారు.

పొరపాటున తొలగించారా లేక కావాలనే చేశారా అని స్పష్టత కోరారు. కావాలని తొలగించి ఉంటే పార్టీ నుంచి బహిష్కరించినట్లు భావిస్తానని తెలిపారు. 48 గంటల్లో పేరు చేర్చకపోతే పార్లమెంట్‌ సెక్రటేరియట్‌ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. నాకు నేనుగా స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాల్సి ఉంటుందని రఘురామ తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి:

ఆన్లైన్​లో చదువులెలా?.. టీవీలు, మొబైల్స్ లేని వారి సంగతేంటి?

Last Updated : Jun 13, 2021, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details