ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 14, 2021, 1:12 PM IST

ETV Bharat / city

విజయవాడ మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం: ఎంపీ కేశినేని

విజయవాడ కార్పొరేషన్‌లో ఎన్నికల వేడి మొదలైంది. తెదేపా ఎంపీ కేశినేని నాని విద్యాధరపురంలోప్రచారం ప్రారంభించారు. పలు డివిజన్లలో పాదయాత్ర నిర్వహించారు.

విజయవాడ మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం: ఎంపీ కేశినేని
విజయవాడ మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం: ఎంపీ కేశినేని

కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ మేయర్ పీఠం తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని ఎంపీ కేశినేని నాని ధీమాతో చెప్పారు. విజయవాడ అభివృద్ధి చెందాలంటే తెదేపా అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. మంత్రి వెల్లంపల్లి అవినీతి చూసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు విసిగిపోయారన్నారు. మంత్రి అవినీతే ఎన్నికల ప్రచార అస్త్రంగా ముందు కెళ్లనున్నట్లు కేశినేని తెలిపారు.

విజయవాడ మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం: ఎంపీ కేశినేని

ABOUT THE AUTHOR

...view details