MP Kanakamedala On Annamayya Project: అన్నమ్మయ్య ప్రాజెక్టు అంశాన్ని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో ప్రస్తావించారు. భారీ వరదల వల్ల కొట్టుకుపోయిన ప్రాజెక్టు గేట్ల అంశాన్ని ఎగువ సభలో లేవనెత్తారు. నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నిర్వహణ లోపంతోనే పెద్ద నష్టం చోటు చేసుకుంది. నష్టానికి బాధ్యులు ఎవరన్నది కేంద్రమే తేల్చాలి. కేంద్రం స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి. ప్రాజెక్టు గేట్లు సకాలంలో తెరుచుకోకనే నష్టం సంభవించింది. ప్రజల ప్రాణాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. -కనకమేడల రవీంద్ర కుమార్, తెదేపా ఎంపీ
ఊహకందని విపత్తు..
కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నవంబరు 16, 17, 18 తేదీల్లో కుండపోత వర్షాలు కురిశాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడ్డాయి. భారీ వరద ముంచెత్తడం, ప్రకృతి విపత్తు వల్ల అన్నమయ్య, ఫించ జలాశయాల కట్టలు తెగిపోయాయి. ఈ ప్రమాదంలో పలు గ్రామాలకు చెందినవారు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం సంభవించి.. బాధిత గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు.