ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 14, 2021, 9:44 PM IST

Updated : Aug 14, 2021, 10:18 PM IST

ETV Bharat / city

Tollywood: సీఎం జగన్‌ను కలవనున్న టాలీవుడ్ ప్రముఖులు !

సీఎం జగన్‌ను కలవనున్న టాలీవుడ్ ప్రముఖులు
సీఎం జగన్‌ను కలవనున్న టాలీవుడ్ ప్రముఖులు

21:41 August 14

ఈ నెల చివరి వారం సీఎం జగన్‌ను కలవనున్న సినీ ప్రముఖులు

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నటులు, దర్శక-నిర్మాతలతో సీఎం చర్చించనున్నారు. కరోనా కారణంగా చిత్ర పరిశ్రమకు వాటిల్లిన నష్టం, పునరుత్తేజం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకురానున్నారు. చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు సీఎంను కలవనున్నారు.

ముఖ్యంగా థియేటర్లు, టికెట్‌ ధరలు సహా పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది. ఆగస్టు చివరి వారంలో ఈ సమావేశం జరుగుతుందని తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరి ఈ భేటీలో ఎవరెవరు పాల్గొంటారనే విషయంపై త్వరలోనే పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. గతంలోనూ సీఎం జగన్‌ తెలుగు సినీ పరిశ్రమ పెద్దలతో భేటీ అయ్యారు. ఈ విషయంలో మంత్రి పేర్ని నాని కీలకంగా వ్యవహరించారు.

ఇదీ చదవండి:

KRMB: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కృష్ణా బోర్డు నివేదిక!

Last Updated : Aug 14, 2021, 10:18 PM IST

ABOUT THE AUTHOR

...view details