ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్​ ఇదే

Modi tour in AP: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు.. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా.. జులై 4న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో.. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

By

Published : Jun 26, 2022, 10:21 AM IST

Modi tour in Andhra Pradesh on july 4th
జులై 4న రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన

Modi tour in AP: ప్రధాని నరేంద్ర మోదీ జులై 4న రాష్ట్రంలో పర్యటించనున్నారు. జులై 4 ఉదయం 9.20 గంటలకు బేగంపేట నుంచి బయల్దేరి.. 10.10 గంటలకు విజయవాడ చేరుకోనున్నారు. అక్కడి నుంచి 10.50 గంటలకు.. ప్రధాని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం చేరుకోనున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న ఆయన.. అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సభ అనంతరం విజయవాడ చేరుకుని ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లనున్నారు.

ABOUT THE AUTHOR

...view details