ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పన్నుల పెంపుపై ప్రతిపక్షాల ప్రచారమంతా అబద్ధం: ఎమ్మెల్యే విష్ణు - విజయవాజలో పన్నులు పెంచుతారంటూ ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే విష్ణు మండిపాటు

విజయవాడలో పన్నుల విధానంపై శ్వేత పత్రం విడుదల చేస్తామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కార్పొరేషన్​ పరిధిలో పన్నులు పెంచుతారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం అసత్యమని స్పష్టం చేశారు. 31వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థితో కలిసి ఆయన ప్రచారం చేశారు.

mla malladi vishnu clarity on taxes increasing in vijayawada
విజయవాడ కార్పొరేషన్​లో పన్నుల పెంపుపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టత

By

Published : Feb 18, 2021, 4:25 PM IST

కార్పొరేషన్ పరిధిలో పన్నులు పెంచుతారంటూ ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్, విజయవాడ మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. నగర పన్నుల విధానంపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు. 31వ డివిజన్​ కార్పొరేటర్ అభ్యర్థితో కలిసి ఎన్నికల ప్రచారంంలో ఆయన పాల్గొన్నారు.

కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైకాపా అధికారం కైవసం చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. అబివృద్ధి కావాలంటే తమ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని ప్రజలను కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details