రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్(ap governer bishwabushan harichandan)ను.. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు(mizoram governer kambampati haribabu) మర్యాద పూర్వకంగా కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్(raj bhavan)కు చేరుకున్న హరిబాబుకు.. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా స్వాగతం పలికారు.
గవర్నర్ బిశ్వ భూషణ్ను కలిసిన.. మిజోరాం గవర్నర్ హరిబాబు - ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ వార్తలు
మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వివిధ పరిపాలనా సంబంధమైన అంశాలపై వారు చర్చించారు.

తొలుత హరిబాబు రాష్ట్ర గవర్నర్ను మిజోరాం సంప్రదాయాలతో ఘనంగా సత్కరించారు. బిశ్వ భూషణ్ హరిచందన్ రాష్ట్ర సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా శ్రీవేంకటేశ్వరస్వామివారి ప్రతిమను బహూకరించారు. ఇద్దరు గవర్నర్లు సుమారు అరగంటకు పైగా భేటి కాగా, సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. దేశంలో కరోనా పరిస్థితులు చక్కబడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మిజోరాంలో పర్యటించాలని హరిబాబు.. రాష్ట్ర గవర్నర్ హరిచందన్ను ఆహ్వానించారు.
ఇదీ చదవండి:
Vice President: గన్నవరం చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు