'సీవీ రెడ్డి ఛారిటీస్' వ్యవస్థాపకులు చుండూరు వెంకటరెడ్డి 40వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ విజయవాడలో నిర్వహించారు. ఆయన విగ్రహానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పూలమాల వేశారు. ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి సేవ చేశారని మంత్రి కొనియాడారు. దాదాపు 100 మంది పేద, వేద విద్యార్థులకు స్కాలర్ షిప్పులు.. మరో 100 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 500 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం ఛైర్మన్, ఈవో తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో చుండూరు వెంకటరెడ్డి 40వ వర్ధంతి సంస్మరణ సభ - minister vellampalli started chunduru venkatareddy memorial meet in vijayawada
విజయవాడలో 'సీవీ రెడ్డి ఛారిటీస్' ఆధ్వర్యంలో.. విద్యార్థులకు స్కాలర్షిప్పులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సంస్థ వ్యవస్థాపకులు చుండూరు వెంకటరెడ్డి 40వ వర్ధంతి సందర్భంగా.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి సంస్మరణ సభ ప్రారంభించారు. సంస్థ చేసిన సేవలను కొనియాడారు.

విజయవాడలో చుండూరు వెంకటరెడ్డి 40 వర్ధంతి సంస్మరణ సభ