ఆస్ట్రేలియా ప్రతినిధులతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతిలో భేటీ అయ్యారు. రాష్ట్ర వర్సిటీల్లో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా కృషి చేయడానికి, విద్యాశాఖలో మార్పులను దృష్టిలో పెట్టుకొని చర్చలు జరిపారు. ముఖ్యంగా పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై ఆస్ట్రేలియా బృందంతో చర్చించినట్లు మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేసి దేశంలోనే అత్యున్నతమైన విద్యాలయాలుగా తీర్చిదిద్దుతామన్నారు.
ఆస్ట్రేలియా ప్రతినిధులతో విద్యాశాఖ మంత్రి భేటీ - australian delegates
ఆస్ట్రేలియా ప్రతినిధులతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతిలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు.. ఆస్ట్రేలియా ప్రతినిధులతో మంత్రి చర్చించారు.

ఆస్ట్రేలియా ప్రతినిధులతో మంత్రి సురేష్ భేటీ