ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 31, 2022, 6:52 PM IST

ETV Bharat / city

అందరూ నన్నలా అంటుంటే.. సంతోషంగా ఉంది: మంత్రి సురేశ్

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్న మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. తనని అందరూ అమ్మఒడి మంత్రి అంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ల్యాప్​టాప్​లు ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

అందరూ నన్నలా అంటుంటే సంతోషంగా ఉంది
అందరూ నన్నలా అంటుంటే సంతోషంగా ఉంది

వచ్చే విద్యా సంతవత్సరం నుంచి విద్యార్థులకు ల్యాప్​టాప్​లు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు. "నాడు-నేడు"లో భాగంగా పాఠశాలల ఆధునికీకరణ చేస్తున్నామన్నారు. విజయవాడలోని సింగ్ నగర్​లో ఉన్న ఎంకే బేగ్ పాఠశాలలో నిర్మించిన అదనపు గదులను మంత్రి ప్రారంభించారు. కోటిన్నర రూపాయలతో తరగతి గదులు నిర్మించినట్లు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్న మంత్రి.. తనని అందరూ అమ్మఒడి మంత్రి అంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details