ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 25, 2022, 4:58 PM IST

ETV Bharat / city

ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణీ: మంత్రి కారుమూరి

Free rice distribution: ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విశాఖ, తిరుపతి మినహా మిగిలినచోట్ల ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు.. మంత్రి కారుమూరి తెలిపారు. కేంద్రప్రభుత్వం ప్రస్తుతం 2.68 కోట్ల మందికి మాత్రమే ఉచిత బియ్యం ఇస్తుండగా.. మిగతా 1.58 కోట్ల మందికి రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

minister karumuri nageshwar rao speaks on free rice distribution
ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణీ: మంత్రి కారుమూరి

Free rice distribution: ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విశాఖ, తిరుపతి మినహా మిగిలినచోట్ల ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని.. రాష్ట్రంలోని మిగతా వారికీ వర్తింపజేసి ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 2.68 కోట్ల మందికి మాత్రమే ఉచిత బియ్యం ఇస్తోందని.. మిగతా 1.58 కోట్ల మందికి రాష్ట్రప్రభుత్వమే ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణీ: మంత్రి కారుమూరి

ABOUT THE AUTHOR

...view details