దేశవ్యాప్తంగా నైరుతీ రుతుపవనాలు బలహీనపడటంతో ఈశాన్య రుతుపవనాల దిగువ ట్రోపోస్పియరిక్ స్థాయిలో వీస్తున్నాయని.. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతీ తురుపవనాలు తిరోగమించటంతో.. చాలా చోట్ల వర్షపాతం తగ్గిందని వెల్లడించింది. ఆగ్నేయ భారత్లో.. ఈశాన్య రుతుపవనాల ప్రభావం కనిపిస్తోందని స్పష్టం చేసింది. వీటి ప్రభావంతో ఆగ్నేయ- దక్షిణ మధ్య బంగాళాఖాతంలో.. రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ కారణంగా ఇవాళ రేపు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రతో పాటు.. చాలా చోట్ల మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలిపింది. రాయలసీమలో సైతం ఒకటి రెండు చోట్ల వర్షాలు కురుస్తాయని వివరించింది.
Weather Update: ఇక ఈశాన్య వంతు.. 48 గంటల్లో అల్పపీడనం - ఏపీలో వర్షసూచనలు తాజా వార్తలు
రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో ఆగ్నేయ- దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు.. అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతీ రుతుపవనాలు బలహీనపడటంతో.. ఈశాన్య రుతుపవనాల దిగువ ట్రోపోస్పియరిక్ స్థాయిలో వీస్తున్నాయని తెలిపింది. దీని వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

ఇక ఈశాన్య వంతు.. 48 గంటల్లో అల్పపీడనం