ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 9, 2020, 8:27 AM IST

ETV Bharat / city

ఓ ఇంటి కిటికీలోంచి తొంగి చూసిన చిరుత

హైదరాబాద్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో ఉద్యోగులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఓ ఇంటి కిటికీలోంచి తొంగి చూసిన చిరుత
ఓ ఇంటి కిటికీలోంచి తొంగి చూసిన చిరుతఓ ఇంటి కిటికీలోంచి తొంగి చూసిన చిరుత

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం రేపింది. జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నారం ఫామ్‌హౌస్‌లోని ఓ ఇంటి కిటికీ ఎక్కి తొంగిచూస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. చిరుత సంచారంతో స్థానికులు, వర్సిటీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. చిరుతను వెంటనే బంధించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details