ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 3, 2020, 4:00 PM IST

ETV Bharat / city

ఆర్థిక సాయం కోసం న్యాయవాదుల నిరసన

లాక్​డౌన్ సమయంలో కేసులు రాక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, తమని ప్రభుత్వం ఆదుకోవాలని న్యాయవాదులు డిమాండ్​ చేశారు. విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏ.ఎస్ రామారావు హల్ వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు.

lawyers protest for economical help at vijayawada
విజయవాడలో న్యాయవాదుల నిరసన

విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏఎస్ రామారావు హల్ వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులకు ప్రభుత్వం రూ.2 లక్షల రూపాయల వరకు లోన్ ఇవ్వాలని కోరారు. లా నేస్తం పథకం పేరుతో జూనియర్ న్యాయవాదులకు చేస్తున్న ఆర్థిక సాయాన్ని కొనసాగించాలని కోరారు. లాక్ డౌన్ సమయంలో కేసులు రాకపోవటంతో న్యాయవాదులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ పరిస్థితిని స్కిట్​ల రూపంలో న్యాయవాదులు ప్రదర్శించారు.

ABOUT THE AUTHOR

...view details