రాష్ట్రంలో కొత్తగా 396 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఆరుగురు కొవిడ్తో మృతి చెందారు. 566 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,222 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఒక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో 24 గంటల్లో 40,855 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.