ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 55 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 55 మంది కరోనా బారినపడ్డట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నూతనంగా నమోదైన కేసులతో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ బాధితుల సంఖ్య 8,88,869కి చేరింది.

By

Published : Feb 14, 2021, 6:57 PM IST

రాష్ట్రంలో కొత్తగా 55 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 55 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 55 మందికి కొవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ బారినపడ్డ వారి సంఖ్య 8,88,869కి చేరిందని వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా ఎవరూ మృతి చెందలేదని తెలిపిన వైద్యారోగ్యశాఖ.. మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 7,161 మంది మృతి చెందినట్లు ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మరో 117 మంది కొవిడ్​ నుంచి కోలుకోగా..మెుత్తం కోలుకున్నవారి సంఖ్య 8.8 లక్షలకు చేరింది. ఇప్పటి వరకూ కరోనా నిర్ధరణ పరీక్షలు 1 కోటీ 35 లక్షలు దాటినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details