ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1,901 కరోనా కేసులు

By

Published : Oct 26, 2020, 6:11 PM IST

Updated : Oct 26, 2020, 6:49 PM IST

రాష్ట్రంలో కొత్తగా 1,901 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,901 కరోనా కేసులు

18:09 October 26

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజు వ్యవధిలో 51,544 నమూనాలను పరీక్షించగా 1,901 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,08,924కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 19 మంది కరోనా చికిత్స పొందుతూ మృతిచెందారు. 

చిత్తూరు జిల్లాలో 4, కడప 3, కృష్ణా 3, అనంతపురం 2, తూర్పుగోదావరి 2, గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,606కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 3,972 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 28,770 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 76,21,896 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

Last Updated : Oct 26, 2020, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details