ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు...తాజాగా 3,765 మందికి పాజిటివ్

By

Published : Oct 23, 2020, 5:42 PM IST

Updated : Oct 23, 2020, 6:13 PM IST

రాష్ట్రంలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు
రాష్ట్రంలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు

17:40 October 23

తాజా కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 8 లక్షలు దాటాయి. ఇవాళ తాజాగా 3,765 మందికి కొవిడ్‌ సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి బాధితుల సంఖ్య 8,00,684కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో మరో 20  మంది మృతి చెందారు. కాగా ఇప్పటి వరకు వైరస్ కారణంగా 6,544 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు 7,62,419 మంది బాధితులు కోలుకోగా...ప్రస్తుతం 31,721 యాక్టివ్‌ కేసులున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 80,238 మందికి పరీక్షలు నిర్వహించగా...ఇప్పటివరకు మెుత్తం 74.28 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు.  

జిల్లాల వారీగా కేసులు...

పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 532 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు 523, తూర్పుగోదావరి 475, కృష్ణా 460, చిత్తూరు 347, ప్రకాశం 317, కడప 225, విశాఖ 218, శ్రీకాకుళం 199, అనంతపురం 152, విజయనగరం 126, నెల్లూరు 122, కర్నూలు 69  చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.  

జిల్లాల వారీగా మరణాలు...  

గుంటూరు 4, కడప 3, కృష్ణా 3, అనంతపురం 2, చిత్తూరు 2, తూర్పుగోదావరి 2, కర్నూలు 1, ప్రకాశం 1, విశాఖ 1, పశ్చిమగోదావరి ఒకరు చొప్పున ప్రాణాలు విడిచారు.  

Last Updated : Oct 23, 2020, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details