ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ సమావేశం

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ హైదరాబాద్​లో సమావేశమైంది. రెండు రాష్ట్రాల నీటి వినియోగంపై ఇంజినీర్ల కమిటీ చర్చిస్తోంది.

By

Published : Jan 12, 2021, 7:33 PM IST

Krishna River Management Board Committee Meeting
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ సమావేశం

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ హైదరాబాద్​లో సమావేశమైంది. రెండు రాష్ట్రాల నీటి వినియోగంపై ఇంజినీర్ల కమిటీ చర్చిస్తోంది. రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటి వివరాలను పరిశీలిస్తోంది.

తెలుగు రాష్ట్రాలకు డిసెంబరు 31 వరకు కేటాయించిన నీటిలో వినియోగం, నష్టాలపై స్పష్టత రానుంది. రాబోయే మూడు నెలలకు నీటి కేటాయింపుపై వారం రోజుల్లో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనుంది. రానున్న మూడు నెలలకు తెలంగాణ 82.92 టీఎంసీలు, ఏపీ 108.50 టీఎంసీలు కేటాయించాలని బోర్డును కోరిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి :తెలుగు ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details