ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశం

విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. నాంచారయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ దిశ పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కలెక్టర్ ఇంతియాజ్ విచారణకు ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించారు. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు.

By

Published : Aug 10, 2020, 11:24 PM IST

Published : Aug 10, 2020, 11:24 PM IST

సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశం
సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశం

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్​ నాంచారయ్య లైంగికంగా వేధిస్తున్నారంటూ డీటీపీ ఆపరేటర్ పని చేస్తున్న మహిళ దిశ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణకు కలెక్టర్ ఇంతియాజ్ కమిటీని నియమించారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ , ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరక్టర్ కమిటీ సభ్యులుగా త్రిసభ్య కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ పోలీస్ స్టేషన్ లో డాక్టర్​ నాంచారయ్యపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారించేందుకు ఆసుపత్రికి వెళ్లగా సూపరింటెండెంట్ అక్కడ లేకపోవటంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయారని సమాచారం. వేధింపులకు సంబంధించిన ఆడియో టేపులను బాధితురాలు ఇప్పటికే పోలీసులకు అందించారు.

ఇదీ చదవండి : 'నక్సలైటుగా మారేందుకు అవకాశం ఇవ్వండి'.. రాష్ట్రపతికి ఎస్సీ యువకుడి లేఖ

ABOUT THE AUTHOR

...view details