చంద్రబాబు పిలుపు మేరకే రాజకీయాల్లోకి: శ్వేత
జన్మభూమి రుణం తీర్చుకుంటాను:శ్వేత - ఏపీలో మున్సిపల్ ఎన్నికల వార్తలు
నగర ప్రజలు అవకాశం ఇస్తే... విజయవాడను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత అన్నారు. విజయవాడ 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఆమె ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఎన్టీఆర్ కూడలిలలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన శ్వేత.. ర్యాలీగా నామినేషన్ వేసేందుకు వెళ్లారు. ప్రస్తుతానికి మేయర్ రేసులో లేనని.... ఆ నిర్ణయం అధిష్టానానిదే అని చెప్పారు. తన చదువు ఉద్యోగ అనుభవాన్ని నగరాభివృద్ధికి ఉపయోగిస్తానన్నారు.

kesineni nani daughter filed nomination in vijayawada