ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ROUND TABLE MEETING: 'కాపు సామాజిక భవనాలను పూర్తి చేయాలి'

కాపు సామాజిక వర్గానికి చెందిన భవన నిర్మాణాలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కనీసం ప్రభుత్వం శంకుస్థాపన చేసిన స్థలాన్ని అప్పగిస్తే సొంత నిధులతో నిర్మించుకుంటామని కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా నేత బొండా ఉమా అన్నారు.

By

Published : Sep 14, 2021, 9:52 PM IST

kapu round table meeting
kapu round table meeting

విజయవాడలో గతంలో మంజూరు చేసిన సామాజిక భవనాలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ.. కాపు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలో కాపు భవనాలను రద్దు చేసే హక్కు ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఎవరిచ్చారని ముఖ్యఅతిథిగా హాజరైన తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

వంగవీటి రంగా, దాసరి నారాయణరావు పేరుపై గత తెదేపా ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్క కమ్యూనిటీ భవనానికి రూ. 75 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామన్నారు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలో వచ్చాక.. తెదేపా ఇచ్చిన జీవో-191ని స్థానిక ఎమ్మెల్యే విష్ణు కక్షతో రద్దు చేయించారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా..ఈ ప్రభుత్వం కాపు భవనాల నిర్మాణాన్ని పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు.

భవనాల కోసం శంకుస్థాపన చేసిన స్థలాలను అప్పగిస్తే సొంత నిధులతో వాటిని నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ, ముఖ్యమంత్రికి లేఖలు రాసే ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు. కాపులందరికీ ఈ విషయాన్ని తెలియజేసి.. వారిని చైతన్యపరిచేందుకు సమావేశంలో తీర్మానం చేశారు.

ఇదీ చదవండి:

Peethala Sujatha: 'నేరస్థులు.. ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు వదలి వెళ్తారా'

ABOUT THE AUTHOR

...view details