ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుత్ రంగంలో సంస్కరణల ఘనత చంద్రబాబుది: కళా వెంకట్రావు

By

Published : Jul 10, 2021, 11:46 AM IST

విద్యుత్ రంగంలో సంస్కరణల ఘనత చంద్రబాబుది అని తెదేపా నేత కళా వెంకట్రావు అన్నారు. కమీషన్లు దండుకుంటున్న ఘనత జగన్‌రెడ్డిది అని విమర్శించారు.

kala venkatrao on power charges
kala venkatrao on power charges

విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదయితే, కమీషన్లు దండుకుంటున్న ఘనత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రెడ్డిదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. వైకాపా ప్రభుత్వం చేతకాని పాలనతో 2 ఏళ్లలోనే విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లుపెట్టి అన్నదాతల్ని అప్పుల పాలు చేయొద్దని కోరారు. మాట ఇవ్వడం మోసం చేయడం జగన్ రెడ్డికి దిన చర్యగా మారిందని కళా వెంకట్రావు విమర్శించారు.

ఎన్నికలకు ముందు కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పి, అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే మూడుసార్లు పెంచి ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ రేట్లు ఒక్క పైసా కూడా పెంచలేదని.. మిగులు విద్యుత్ సాధించి 24 గంటల కరెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. నేడు వైకాపా ప్రభుత్వ చేతకానిపాలన, అనాలోచిత నిర్ణయాలతో కరెంట్ కోతలు, విద్యుత్ బిల్లుల మోతలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని కళావెంకట్రావు దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details