ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేటి నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

By

Published : Mar 19, 2022, 10:34 PM IST

Updated : Mar 20, 2022, 4:45 AM IST

Janasena Party Membership Drive: నేటి నుంచి ఈనెల 27 వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్​ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

JSP Membership Drive from  20th to 27th of march
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

నేటి నుంచి 27వ తేదీ వరకు మరోసారి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. నాయకుల కోరిక మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతంలో క్రియాశీలక సభ్యులుగా చేరలేకపోయిన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం దాదాపు 3500 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని చెప్పారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి జనసైనికులు, వీర మహిళలు.. బాగా కృషిచేశారని... వారందరికీ అభినందనలు తలిపారు.

Last Updated : Mar 20, 2022, 4:45 AM IST

ABOUT THE AUTHOR

...view details