ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 5, 2021, 3:42 PM IST

ETV Bharat / city

'రామమందిర నిర్మాణానికి విరాళమివ్వడానికి మంత్రి వెల్లంపల్లి అనర్హులు'

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​పై జనసేన నేత పోతిన మహేష్ పలు ఆరోపణలు చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళం ఇవ్వడానికి ఆయన అనర్హుడని విమర్శించారు. దుర్గగుడి ఈవోను సమర్థిస్తూ.. ఆలయ ఆదాయానికి గండికొట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్న పాలకమండలితో కుమ్మక్కయ్యారన్నారు.

janasena leader allegations on minister vellampalli in vijayawada
మంత్రి వెల్లంపల్లిపై విజయవాడలో జనసేన నేత పోతిన మహేష్ ఆరోపణలు

అయోధ్యలో రామమందిరం నిర్మించేందుకు దొంగలైనా విరాళమివ్వవచ్చు కానీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనర్హులని జనసేన నేత పోతిన మహేష్‌ విమర్శించారు. రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదనంతో పాటు 140 దేవాలయాలపై జరిగిన దాడులకు పాప పరిహారంగా ఆయన విరాళం ఇచ్చారన్నారు.

లీజు, లైసెన్సుదారులకు మేలు చేయమని దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేస్తే.. ఆ ముసుగులో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్న ఆలయ ఈవో సురేష్ బాబును మంత్రి ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు. ఫొటో ల్యామినేషన్, కాలమానిని, అన్నదానం, లడ్డూ కాంట్రాక్ట్​దారుల కాలాన్ని పొడిగిస్తూ.. ఆలయ ఆదాయానికి గండి కొట్టాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. వారితో వెల్లంపల్లి కుమ్మక్కైనట్లు తెలుస్తోందని ఆరోపించారు. ఈ నాలుగు కాంట్రాక్ట్​లకు టెండర్లు పిలవకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details