ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇస్కాన్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు నిత్యాన్నదానం - విజయవాడలో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్న ఇస్కాన్

లాక్​డౌన్ వేళ నిరాశ్రయులైన పేదవారికి అన్నప్రసాదాలు అందిస్తోంది ఇస్కాన్ సంస్థ. దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా నిత్యం అన్నదానం చేస్తోంది. విజయవాడలోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టి పేదలకు కడుపు నింపుతోంది.

isckon
isckon

By

Published : May 13, 2020, 5:43 PM IST

కరోనా వ్యాప్తితో లాక్​డౌన్ విధించిన కారణంగా.. అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఇలాంటి వారికి.. విజయవాడలో ఇస్కాన్ సంస్థ అన్నప్రసాదాలు పంచిపెట్టింది. నిరుపేదలకు, నిరాశ్రయులకు నిత్యం అన్నదానం చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

లాక్ డౌన్ ప్రారంభమైన రోజు నుంచి నిరాశ్రయులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా సుమారు 2 కోట్ల 63 లక్షల మందికి నిత్యం అన్నప్రసాదాన్ని ఇస్కాన్ సంస్థ అందజేస్తుందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details