కరోనా కారణంగా చైనా నుంచి భారత్కు తరలివచ్చే పరిశ్రమలను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రూపొందించుకుంటున్నామని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్రెడ్డి స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే నూతన పారిశ్రామిక విధానం ఉంటుందని వెల్లడించారు. విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో నిర్వహించిన పరిశ్రమల టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడారు.
'పరిశ్రమలను ఆకట్టుకునేలా నూతన పారిశ్రామిక విధానం' - పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి న్యూస్
పరిశ్రమలను ఆకట్టుకునేలా నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు మంత్రి గౌతమ్రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. చైనా నుంచి భారత్కు తరలివచ్చే పరిశ్రమలను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రూపొందించుకుంటున్నామన్నారు.
'పరిశ్రమలను ఆకట్టుకునేలా నూతన పారిశ్రామిక విధానం'
ఇక్కడికి వచ్చే పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు, నైపుణ్యం ఉన్న వర్క్ఫోర్స్ను పరిశ్రమలకు అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అదే పెద్ద ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. మరో వైపు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై ఇంకా విచారణ కొనసాగుతోందని.., ఎన్జీటీ ఆదేశాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ ప్రమాదంపై విచారణ నివేదిక ఇంకా ప్రభుత్వానికి అందలేదన్నారు.
ఇదీ చదవండి:'ఇకపై సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్'