ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నిర్ణయం వెనక్కు తీసుకోకపోతే న్యాయ పోరాటమే' - తితిదే నిర్ణయంపై బుచ్చిరాం ప్రసాద్ వ్యాఖ్యలు

తిరుమల దేవాలయ ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని తితిదే వెనక్కు తీసుకోవాలని.. లేకపోతే న్యాయ పోరాటం చేస్తామని.. ఇండో-అమెరికన్ బ్రాహ్మణ సంస్థ ఛైర్మన్ బుచ్చిరాం ప్రసాద్.. ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

indo american brahmana organisation chairman bucchiram prasad on tirumala assests selling
బుచ్చిరాం ప్రసాద్, ఇండో అమెరికన్ బ్రాహ్మణ సంస్థ ఛైర్మన్

By

Published : May 25, 2020, 7:56 PM IST

శ్రీవారి ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని తితిదే వెనక్కు తీసుకోవాలని ఇండో-అమెరికన్ బ్రాహ్మణ సంస్థ ఛైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ డిమాండ్‌ చేశారు. వెంకన్నకు భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తిని అమ్మే హక్కు తితిదేకు లేదన్న ఆయన.. ఆస్తులను పరిరక్షించుకోలేక అమ్మకానికి పెడుతున్నారని మండిపడ్డారు.

భూములు నిరర్ధకమైనవని వైవీ సుబ్బారెడ్డి చెప్పడం దారుణమని విమర్శించారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏడాది పాలనలో వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విలువైన భూములపై అధికార పార్టీ కన్ను పడిందని ఆరోపించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details