ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,461 కరోనా కేసులు, 15 మరణాలు

By

Published : Aug 10, 2021, 5:05 PM IST

Updated : Aug 10, 2021, 5:56 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు

17:03 August 10

రాష్ట్రంలో కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో  63,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,461 కరోనా కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. వైరస్ నుంచి మరో 2,113 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,882 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కొవిడ్​తో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు.  

 పశ్చిమగోదావరి జిల్లాలో 235, కృష్ణా జిల్లాలో 210, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 195 చొప్పున, గుంటూరు జిల్లాలో 182, ప్రకాశం జిల్లాలో 112, తూర్పుగోదావరి జిల్లాలో 98, విశాఖ జిల్లాలో 74, కడప జిల్లాలో 59, శ్రీకాకుళం జిల్లాలో 41, అనంతపురం జిల్లాలో 28, విజయనగరం జిల్లాలో 20, కర్నూలు జిల్లాలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి.  

ఇదీచదవండి.

Revenue deficit funds released to AP: ఐదో విడత రెవెన్యూ లోటు నిధులు విడుదల

Last Updated : Aug 10, 2021, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details