ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,869 కరోనా కేసులు..18 మరణాలు

By

Published : Aug 11, 2021, 3:40 PM IST

Updated : Aug 11, 2021, 5:02 PM IST

corona-cases-registered-in -andhrapradhesh
ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు నమోదు

15:37 August 11

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు నమోదు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 71,030 మందికి కరోనా పరీక్షలు(corona tests) నిర్వహించగా.... కొత్తగా 1,869 కరోనా కేసులు, 18 మరణాలు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వైరస్ నుంచి మరో 2,316 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,417 కరోనా యాక్టివ్‌ కేసులు(corona active cases) ఉన్నాయి.

జిల్లాల వారీగా కరోనా మృతులు...  

కరోనా కారణంగా చిత్తూరులో ఐదుగురు, కృ ష్ణా లో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, అనంతపురం, తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు...  

తూర్పుగోదావరిలో 385, పశ్చిమగోదావరిలో 304, గుంటూరులో 222, నెల్లూరులో 177, చిత్తూరులో 175, కృష్ణాలో 148, కడపలో 133, ప్రకాశంలో 98, శ్రీకాకుళంలో 82, అనంతపురంలో 51, విశాఖపట్నంలో 63, విజయనగరంలో 21, కర్నూలులో 10 కరోనా కేసులు నమోదయ్యాయి.  

ఇదీచదవండి.

వివేకా హత్య కేసులో దోషులను త్వరగా తేల్చండి: నారాయణ

Last Updated : Aug 11, 2021, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details