ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రూ. 3.50 కోట్లు విలువైన సిగరెట్ల డంప్ సీజ్.. పరారీలో నిందితులు' - కృష్ణా జిల్లా విజయవాడలో భారీ విదేశీ సిగరెట్ల డంప్ ను పోలీసులు గుర్తించారు

కృష్ణా జిల్లా విజయవాడలో భారీ విదేశీ సిగరెట్ల డంప్ ను పోలీసులు గుర్తించారు. సరకు ఉన్న గోదామును సీజ్ చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

cigar dump caught
సిగరెట్ల డంప్ సీజ్

By

Published : Dec 31, 2020, 10:47 PM IST

కృష్ణా జిల్లా విజయవాడలో భారీ విదేశీ సిగరెట్ల డంప్ ను పోలీసులు పట్టుకున్నారు. 132 బేళ్ల విదేశీ సిగరెట్ల డంప్ విలువ సుమారు రూ. 3.50 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. సరకు ఉన్న గోదామును సీజ్ చేసారు.

దిల్లీ నుంచి వాటిని ఏపీ వ్యాప్తంగా సరఫరా చేసేందుకు ముఠా తెప్పించినట్లు పోలీసులు వెల్లడించారు. హర్యానాకు చెందిన హరి, గుడౌన్ అధినేత శ్యాం లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details