ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆ విద్యార్థినికి యాజమాన్య కోటాలో కౌన్సెలింగ్‌'.. ఎన్టీఆర్ వర్సిటీకి హైకోర్టు ఆదేశాలు - ఎన్టీఆర్ వర్సటీకి హైకోర్టు ఆదేశాలు

కన్వీనర్‌ కోటాలో ప్రవేశం పొందిన మెడికల్ పీజీ విద్యార్థులను యాజమాన్య కోటాలో అనుమతించట్లేదని ఓ విద్యార్థిని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇవాళ వాదనలు విన్న న్యాయస్థానం.. పిటిషనర్‌ను యాజమాన్య కోటాలో కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వాలని ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఆదేశాలు జారీ చేసింది.

ఎన్టీఆర్ వర్సటీకి హైకోర్టు ఆదేశాలు
ఎన్టీఆర్ వర్సటీకి హైకోర్టు ఆదేశాలు

By

Published : Apr 7, 2022, 6:57 PM IST

కన్వీనర్‌ కోటాలో మెడికల్ పీజీ ప్రవేశాలు పొందినవారిని యాజమాన్య కోటాలో అనుమతించట్లేదని చింతా మౌనిక అనే విద్యార్థిని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మేనేజ్​మెంట్ కోటాలో ప్రవేశం పొందాలంటే కన్వీనర్ కోటాలో సీటు వదులుకోవాలని పెట్టిన నిబంధనపై హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్​పై వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.. యాజమాన్య కోటాలో అనుమతించకపోవడం చట్టవిరుద్ధమన్నారు. యాజమాన్య కోటాలో సీట్లు ఇవ్వకూడదనే దురుద్దేశంతోనే యూనివర్సిటీ విద్యార్థులకు అన్యాయం చేసిందని వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుతానికి పిటిషనర్​ని మేనేజ్​మెంట్ కోటాలో కౌన్సెలింగ్​కు అనుమతించాల్సిందిగా ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details