పీపీఏలపై విచారణ రేపటికి వాయిదా! - High Court hearing on electricity tariffs today
పవన, సౌర విద్యుత్ టారిఫ్ల కుదింపుపై పలు విద్యుత్ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. గతంలో టారిఫ్లపై ఏపీఎస్పీడీసీఎల్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే.
![పీపీఏలపై విచారణ రేపటికి వాయిదా!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4264006-715-4264006-1566963790486.jpg)
విద్యుత్ టారిఫ్లపై నేడు హైకోర్టు విచారణ
విద్యుత్ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు కొందరు పిటిషనర్లు తమ వాదనలు విన్నారు. మరి కొందరు వాదనలు వినిపించాల్సి ఉండగా..ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది. పవన, సౌర విద్యుత్ టారిఫ్ కుదింపుపై పలు విద్యుత్ కంపెనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. విద్యుత్ టారిఫ్లపై ఏపీఎస్పీడీసీఎల్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని వ్యాజ్యం దాఖలు చేశాయి. ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి సమీక్ష కమిటీని నిలువరించాలని పిటిషన్లో కోరారు.
Last Updated : Aug 28, 2019, 4:01 PM IST