హెచ్సీయూలో పీహెచ్డీ విద్యార్థిని మృతి - phd student died
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్న ఓ విద్యార్థిని స్నానాలగదిలో జారిపడి తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
![హెచ్సీయూలో పీహెచ్డీ విద్యార్థిని మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3914789-417-3914789-1563798045238.jpg)
పీహెచ్డీ విద్యార్థిని మృతి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విద్యార్థిని యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్న దీపికగా గుర్తించారు. వసతి గృహంలోని స్నానాల గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించిన ఆమె స్నేహితులు యాజమాన్యానికి తెలిపారు. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె నరాల సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నట్లు తెలిపారు.