ప్రభుత్వాస్పత్రులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రెమ్డెసివిర్ ఔషధాలకు కొరత రాకుండా చర్యలు తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు ఆస్పత్రుల్లో పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. బ్లాక్ఫంగస్కు వాడే ఇంజక్షన్లు మూడు రోజుల్లో రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో కేసులకు తగ్గట్లు పడకలు సిద్ధం చేస్తున్నామని సింఘాల్ చెప్పారు.
కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు దహన సంస్కారాలకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేలా జీవో ఇచ్చామన్నారు. ఈ పరిస్థితుల్లో కేసుల వివరాలు బహిర్గతం చేయకుండా గోప్యత పాటించాల్సిన పరిస్థితి లేదన్నారు. కర్ఫ్యూలో మార్పులు, లాక్ డౌన్ విధిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సింఘాల్ ఖండించారు. సామాజిక మాద్యమాల్లో మృతుల గురించి తప్పుడు ప్రచారం జరుగుతోందని...ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు.